నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ పార్టీ నేతలే శత్రువులు అని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు సీఎం అభ్యర్థే అని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భూమి కొనుగోలులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. డిండి ప్రాజెక్టుకు ఆర్. విద్యాసాగర్రావు పేరు పెట్టడం సముచితమే అని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్బుక్స్ తయారవుతున్నాయని తెలిపారు. ధరణి వెబ్సైట్ ద్వారా భూములకు సంబంధించిన అన్ని విషయాలను అందుబాటులోకి తెస్తామని గుత్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు.