ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్షే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 21, 2018, 03:33 PM

12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఆ నిందితులకు మరణశిక్ష తప్పనిసరి. మరణశిక్ష విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం ఇవాళ ఆమోదించింది. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం జరిపే వారికి మరణశిక్ష విధించేలా ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ ను ఆమోదం కోసం రాష్ర్టపతికి కేంద్రం పంపనుంది.


12 నుంచి 16 సంవత్సరాల లోపు అమ్మాయిలపై అత్యాచారం చేస్తే 10 నుంచి 20 సంవత్సరాలకు జైలు శిక్ష పొడిగించారు. కేసు తీవ్రతను బట్టి.. జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. క్రిమినల్ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేరపూరిత ఆలోచనలు కూడా అరికట్టేలా కఠిన చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించింది.


పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. ఓ ఎనిమిది నెలల పాపపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ కేసును విచారిస్తున్న.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com