కోల్కతా: కోల్కతా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ కోల్కతాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పేసర్ మోహిత్ శర్మ స్థానంలో అంకిత్ రాజ్పుత్ను తీసుకున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు. పిచ్ ముందుగా బౌలింగ్ అనుకూలంగా ఉన్నందున ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. మరోవైపు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు కోల్కతా సారథి దినేశ్ కార్తీక్ అన్నాడు.