కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, పుల్లెల గోపిచంద్తో పాటు 18 మంది క్రీడాకారులు శనివారం (ఏప్రిల్ 21) మధ్యాహ్నం ప్రగతిభవన్లో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతంగా రాణించారంటూ.. క్రీడాకారులను కేసీఆర్ కొనియాడారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు శాలువాలు కప్పి సన్మానించారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
కామన్వెల్త్లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.