కోల్కతా: పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతున్నారు. రెండో ఓవర్లో ఓపెనర్ నరైన్ వికెట్ కోల్పోవడంతో.. జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన బ్యాట్స్మెన్ క్రమంగా జోరు పెంచారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ అలరిస్తున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో క్రిస్ లిన్ 22(17), ఉతప్ప 24(16) ఉన్నారు.