హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. పుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తిపైకి కారు దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థినిలు ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.