ఉగ్రవాదం మావన మౌలిక హక్కులకు శత్రువని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సహకరించే, ఆర్థికంగా ఆదుకునే దేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచం ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని, వాటిలో అతి ముఖ్యమైనది ఉగ్రవాదమని ఆమె అన్నారు. దీనిపై పోరాటానికి బలమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.