ముంబై :జైలులో తనను ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన కుమార్తె షీనాబోరాను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా కోర్టులో చెప్పారు. తనకు తానుగా అధిక మోతాదుల్లో మందులు వేసుకున్నాననే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. అధిక మోతాదులో మందులు వేసుకుని అపస్మారక స్థితిలో రెండవసారి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఇంద్రాణి తానుగా ఎక్కువ మోతాదుల్లో మందులు వేసుకోలేదన్నారు.