కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించకుండా అక్కడ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం సాధ్యం కాదని ఆ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.