కర్ణాటక ఎన్నికల్లో బిజెపి తరఫున స్టార్ కాంపైనర్గా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవతరించనున్నారు. 35 ర్యాలీలలో, రోడ్షోలలలో ఆయన పాల్గొంటారు. యోగి ఆదిత్యనాథ్ మే 3వ తేదీన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రోజుకు 4 నుంచి 5 ర్యాలీలలో ఆయన పాల్గొంటారు. యుపి ముఖ్యమంత్రి మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను నిర్ధారించారు.