బాగలకోట జిల్లా బాదామి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. చాముండేశ్వరి స్థానం నుంచి కూడా సిద్ధూ పోటీ చేస్తున్న విషయంం తెలిసిందే. బాదామి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బళ్లారి లోక్సభ సభ్యుడు శ్రీరాములు బరిలో ఉన్నాడు. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు గడువు ఉంది. వచ్చే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 15న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.