జగిత్యాల: మెట్పల్లిలోని వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో చేపట్టిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మెట్పల్లి పరిధిలో మరికొన్ని అభివృద్ధి పనులతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పైలాన్ను కేటీఆర్ ఆవిష్కరిస్తారు.