యాదాద్రి: భువనగిరి బైపాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న తుపాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అడ్డగూడూరు మండలం గట్టు సింగారం వాసులుగా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుమలగిరి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని డీసీపీ రాంచంద్రారెడ్డి, సీఐ శంకర్గౌడ్ పరిశీలించారు.