ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాంఖడేలో హైదరాబాద్ సంచలన విజయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 09:14 AM

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 119 పరుగుల లక్ష్యాన్ని అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కాపాడుకుని 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (29: 21 బంతుల్లో 5x4), హిట్టర్ యూసఫ్ పఠాన్ (29: 33 బంతుల్లో 2x4, 1x6) పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడటంతో 118 పరుగులకి ఆలౌటైన హైదరాబాద్.. అనంతరం బౌలర్లు సిద్ధార్థ కౌల్ (3/23), రషీద్ ఖాన్ (2/11) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ముంబయిని 87కే కుప్పకూల్చింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (34: 38 బంతుల్లో 4x4), క్రునాల్ పాండ్య (24: 20 బంతుల్లో 4x4) మినహా ఎవరూ మెరుగైన స్కోరు చేయలేకపోయారు. చాలాసేపు క్రీజులో నిలిచిన హిట్టర్ హార్దిక్ పాండ్య (3: 19 బంతుల్లో) ఘోరంగా విఫలమవడం ముంబయి విజయావకాశాల్ని దెబ్బతీసింది. హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో ఆలౌటవగా.. ముంబయి 18.5 ఓవర్లలో కుప్పకూలడం విశేషం. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com