రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో చందనవెల్లి టెక్స్ టైల్ పార్క్ భూసేకరణ కోసం నిర్వాసితులకు రూ. 81 కోట్ల పరిహారాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. షాబాద్ మండలంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సహకారంతో వివిధ పరిశ్రమలకు 1100 ఎకరాల భూసేకరణ చేశామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం లో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న నూతన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శమన్నారు. పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. మహేశ్వరం , ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లాను పరిశ్రమల హబ్ గా మారుస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.