జోధ్పూర్: పదహారేళ్ల మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేల్చుతూ జోధ్పూర్ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో జరిగిన రేప్ కేసులో ఇవాళ జోధ్పూర్కు చెందిన ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. మణి గ్రామంలో ఉన్న ఆశ్రమంలో.. ఆశారాం బాపు 16 ఏళ్ల యువతిని రేప్ చేశాడు. ఆ కేసులో 2013 ఆగస్టు 31న అతన్ని అరెస్టు చేశారు. యూపీకి చెందిన షాజహాన్పూర్ గ్రామస్తురాలైన ఆ యువతి చికిత్స కోసం ఆశ్రమానికి వెళ్లింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ, శిల్పిలను కూడా దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.మరో ఇద్దరు శరద్, ప్రకాశ్లను కోర్టు నిర్దోషులగా ప్రకటించింది.తాను దైవానికి మారు రూపమని, తనకు అన్నీ సమర్పించుకోవాలని ఆశారాం తనను మోసం చేశాడని రేప్కు గురైన బాధితురాలు ఆరోపించారు. ఆశారంను దోషిగా కోర్టు తేల్చిందని, తమకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ పోరాటంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పాడు. ఈ కేసులో ఆశారాంకు శిక్ష ఖరారు ఆవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. సాక్షులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు. జోధ్పూర్ కోర్టు తీర్పుపై తమ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను ప్రకటిస్తామని ఆశారాం ఆశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.