న్యూఢిల్లీ : స్వయం ప్రకటిత దేవదూతల విషయంలో అసలు, నకిలీల మధ్య తేడాను ప్రజలు ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆశారాం బాపును జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆశారాం బాపు వంటి వ్యక్తుల వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట మంటగలుస్తోందని ఆయన అన్నారు.