న్యూఢిల్లీ : ప్రజాయుద్ధనౌక, విప్లవ గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో సూర్యకిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగం జనార్ధన్ రెడ్డితో పాటు సూర్యకిరణ్ కూడా ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు.