హైదరాబాద్ నగరంలో సనత్నగర్-హఫీజ్పేట మధ్య గూడ్స్ రైలు నిలిచిపోయింది. గూడ్స్ రైలు నిలిచిపోవడం వల్ల రైల్వే అధికారులు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసిన అధికారులు లింగంపల్లి-ఫలక్నుమా, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.