రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన నాగం జనార్దన్ రెడ్డి. బీజేపీకి గుడ్ బై చెప్పిన నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. కొద్ది సేపటి కిందట ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు.