సిద్దిపేటను ఆరోగ్య సిద్దిపేటగా మార్చుకుందామని మంత్రి హరీశ్రావు అన్నారు. మలేరియా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రతి పల్లె ఇబ్రహీంపూర్ గ్రామంగా తయారు కావాలన్నారు. దోమలు లేని పట్టణాలుగా, పల్లెలుగా మారాలని పిలుపునిచ్చారు. వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఫైలేరియా బాధితులకు రూ.వెయ్యి పింఛను అందిస్తామన్నారు. మలేరియా, పైలేరియాపై నిరంతర అవగాహన కల్పించాలన్నారు.