హైదరాబాద్: టీఆర్ఎస్ 17వ ప్లీనరీ వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ఇవాళ ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనున్న విషయం తెలిసిందే.