మేడ్చల్: టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అన్ని అంశాలపై చర్చిస్తారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణాన్ని ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నరు. అనుభవమున్న పార్టీల కంటే తెలంగాణలో టీఆర్ఎస్ పాలన బాగుందన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.