హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజిక్కడ మాట్లాడుతూ 2,650 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణకు మంజూరయ్యాయన్నారు. తెలంగాణకు లాజిస్టిక్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్కి నిధులు మంజూరు చేసిందన్నారు. జాతీయ రహదారుల్లో తెలంగాణ రెండో స్థానం చేరుకుందన్నారు. కేంద్రం ఎన్నో చేస్తుంటే రెండు రాష్ట్రాల సీఎంలు అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.