సూర్యాపేట: కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నరనీ.. పథకాలు అమలుకాకముందే అవినీతి జరిగిందని అంటున్నరని మంత్రి జగదీస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి మంత్రి హరీష్ రావుతో కలిసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో 3 కోట్లతో నిర్మించే 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్లకు మంత్రులు భూమిపూజ చేశారు. ఆ తర్వాత కేతేపల్లి మండలం కొత్తపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్కు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెప్తరన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజలు ఊహించని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. రైతులకు లాభం జరగడం కాంగ్రెస్కు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డికి ఇష్టం లేదన్నారు.