మాస్కో: భూతలం నుంచి గగనతలంలో టార్గెట్ను పేల్చే ఎస్400 క్షిపణుల అమ్మకంపై భారత్తో ఈ ఏడాదే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు రష్యా వెల్లడించింది. ఈ విషయంలో సాంకేతిక అంశాలపై అంగీకారం జరిగినట్లు రష్యన్ మిలిటరీ శాఖ తెలిపింది. ఎస్400 క్షిపణుల విషయంలో కేవలం ధరను మాత్రమే నిర్ధారించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టు డాక్యుమెంట్పై త్వరలో సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు రష్యా మిలిటరీ అధిపతి దిమిత్రి షుగావ్ తెలిపారు.