హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పాస్పోర్టు సేవలను విస్తరించేందుకు 251 హెడ్ పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. మొదటివిడుతగా 192 హెడ్ పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేట, హన్మకొండ హెడ్పోస్టాఫీసుల్లో పాస్పోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు.