బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంనుంచి వారు రాజ్భవన్ వరకూ పాదయాత్ర చేయనున్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే తదితర నాయకులు పాల్గొననున్నారు.