బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించడంపై బిజెపి పార్టీ నాయకుడు సదానంద గౌడ స్పందించారు. అది ఆయా పార్టీల ఇష్టమని, కావాలనుకుంటే వారిని పాకిస్తాన్కైనా తరలించుకోమనండి అని సదానంద గౌడ అన్నారు. తమకు తగినంత సంఖ్యాబలం ఉందని ఆయన చెప్పారు. లేకపోతే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తామని ఆయన ప్రశ్నించారు.