కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం పోతాయిపల్లిలో నంది విగ్రహం బయటపడింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మట్టి తవ్వుతుండగా నంది విగ్రహం బయటపడినట్లు పోతాయిపల్లి గ్రామస్తులు తెలిపారు. నంది విగ్రహం బయటపడటంతో గ్రామస్తులు ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నంది విగ్రహాన్ని చూసేందుకు ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు.