ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారన్న వార్తలను కర్ణాటక కాంగ్రెస్ నేతలు పరమేశ్వర్, డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. యడ్యూరప్పకు ఉన్నంత తొందర తమకు లేదన్నారు. తమతో బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పరమేశ్వర్, డీకే శివకుమార్ తెలిపారు. మరోవైపు బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో బాగంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు.