మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ టీచర్ ఇంట్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. టీచర్ జడల లక్ష్మీ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. 50 తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు విలువైన వస్తువులను దొంగిలించారు. దొంగతనంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన నివాసాన్ని డీఎస్పీ నరేశ్ కుమార్, సీఐ జబ్బర్ పరిశీలించారు. డాగ్ స్కాడ్ తనిఖీలు జరిపింది.