కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలనిరూపణ సందర్భంగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సభలో విశ్వాస పరీక్ష ఎలా జరగాలన్నది ప్రొటెం స్పీకర్ నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. సభ్యులకు రక్షణ కల్పించే బాధ్యత డిజిపి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక శాసనసభలో బల నిరూపణ పూర్తయ్యే వరకూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎలాంటి కీలక విధాన నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో రైతుల రుణాలు మాఫీ దస్త్రంపై యడ్యూరప్ప చేసిన సంతకానికి విలువలేకుండా పోయింది. యడ్యూరప్ప ప్రభుత్వం ఇప్పటికే చేసిన అధికారుల బదిలీలు నిలిచిపోతాయి.