ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుబంధు పథకం ఆ పార్టీలకు భయం పుట్టిస్తుంది : కడియం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 18, 2018, 12:54 PM

వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు భయం పుట్టిస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామంలో అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులను కడియం శ్రీహరి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్, రాష్ట్ర మహిళా ఆర్ధిక సంస్థ చైర్ పర్సన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com