సుప్రీం కోర్టు కర్నాటక అసంబ్లీలో రేపు యెడ్యూరప్ప బలపరీక్ష జరిపి తీరాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం తక్కువ ఉందనీ, కనీసం సోమవారం వరకూ గడువు ఇవ్వాలన్న బీజేపీ వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష జరిపి తీరాలనీ లేదంటే యెడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై సమీక్ష జరుపుతామని పేర్కొంది. దీంతో బీజేపీ బలపరీక్షకు సిద్ధమేనని అంగీకరించింది.