కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ రాజ్యంగ విరుద్ధమని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. బలపరీక్షపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన మీడియాతో స్పందిస్తూ.. యడ్యూరప్ప తనతో పాటు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా పేర్కొంటూ గవర్నర్కు లేఖ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు రోజులు గడువు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తగిన సంఖ్యాబలం లేనప్పటికీ గవర్నర్ యడ్యూరప్పనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు 15 రోజుల గడువును ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.