హైదరాబాద్ : వందకు వంద శాతం కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయన్నారు. ప్రజలు కేసీఆర్ను ఏకోన్ముఖంగా కోరుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో ఉండను అని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.