కర్నాటకలో బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన గోవా, మణిపూర్ లలో ఒకలాగ, కర్నాటకలో మరో విధంగా బీజేపీ వ్యవహరించి, తన అధికార కాంక్షను చాటుకుందన్నారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కూడా బీజేపీ వెనుకాడలేదని అన్నారు. సుప్రీం తీర్పు బీజేపీకి ఒక చెంపపెట్టు అని పేర్కొన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేను కేంద్ర ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్సింగ్ను కేంద్ర ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని ఆయన అన్నారు.