జయశంకర్ భూపాలపల్లి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనుల అంచనా విలువను సవరించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనకట్టల అంచనా వ్యయాన్ని సవరిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంచనా వ్యయంలో రూ. 1762 కోట్లు పెరిగినట్లు ఈసందర్భంగా నీటిపారుదల శాఖ ప్రకటించింది.