హైదరాబాద్: నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో వైటథాన్ పరుగు కార్యక్రమం ప్రారంభమైంది. వైటథాన్ పరుగును పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. రెటీనా బ్లాసోమాపై అవగాహన కోసం 10కే, 5కే, 3కే విభాగాల్లో ఈ పరుగును నిర్వహిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పరుగు కార్యక్రమం జరుగుతున్నది.