నిర్మల్: సరస్వతీ దేవి కొలువైన బాసర క్షేత్రంలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతున్నది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గోదావరి గట్టు కిటకిటలాడుతున్నది. గోదావరి హారతి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదభారతి పీఠం ఆధ్వర్యంలో మహాకుంభ హారతిని నిర్వహించారు.