వరంగల్ రూరల్: మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి ఇవాళ వర్ధన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకంలో భాగంగా పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.