చెన్నై: కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొన్ని రోజులుగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తికట్టించాయి. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అధికారంతోపాటు తమ పార్టీ పరువు, ప్రతిష్టను కూడా పోగొట్టుకుంది.