ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు దిగారు. దంతేవాడ జిల్లా కిరండోల్ దగ్గర జవాన్ల వాహనమే టార్గెట్గా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. జవాన్లు బొలేరో వాహనంలో వెళ్తుండగా మావోయిస్టులు ల్యాండ్మైన్ను పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టులు జవాన్ల ఆయుధాలను ఎత్తుకెళ్లారు.