కర్ణాటకలో సుప్రీం కోర్టు సహాయంతో ప్రజాస్వామ్యం గెలిచిందని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారు. కర్ణాటక రాజకీయాలపై ఆయన స్పందించారు. బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వటం తప్పు అన్నారు. బలనిరూపణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హర్షనీయమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. వచ్చే కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలను విడుదల చేయాలన్నారు.