న్యూఢిల్లి : ప్రధాని నరేంద్రమోడీ తన నియోజక వర్గమైన వారణాశి ప్రజలను మోసగించారని కాంగ్రెస్ విమర్శించింది. వారణాశిలో ఫ్లైవోవర్ కూలిపడి 18 మంది మృతి చెందినప్పటికీ, తన నియోజక వర్గంలో పర్యటించడానికి మోడీ రాలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్నారు. ప్రధాని మోడీ ప్రజా సేవకుడు కాదని, రాజకీయాలకు సేవకుడని షెర్గిల్ విమర్శించారు.