ఐపీఎల్-11లో ఆదివారంతో లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన జట్లేవో తెలిసిపోయింది. ఆఖరి బెర్తు కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడిన విషయం తెలిసిందే. పంజాబ్ జట్టు ప్లేఆఫ్ చేరాలంటే చెన్నైపై 53 పరుగులకు పైగా తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ చేతిలో ముంబయి ఓడిపోతేనే పంజాబ్కు అవకాశం ఉంటుంది.
ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో ఉత్కంఠభరిత పోరులో ముంబయి.. ఢిల్లీ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయంపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. చెన్నై, పంజాబ్ మ్యాచ్ పుణె వేదికగా రాత్రి 8 గంటలకు ఆరంభంకావాల్సి ఉంది. మ్యాచ్ వీక్షించేందుకు కింగ్స్ సహయాజమాని, బాలీవుడ్ నటి ప్రీతీజింతా గ్యాలరీలో ప్రత్యక్షమైంది. ముంబయి ఓడిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రీతీ పక్కనున్న మరో సహయాజమానితో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అతనితో మాట్లాడుతూ.. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబయి ఫైనల్స్కు వెళ్లట్లేదు. చాలా సంతోషం. అని సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పంజాబ్పై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.
Did #PreityZinta just say “I am just very happy that Mumbai is not going to the finals..Really happy” #CSKvKXIP #MIvsDD #IPL #IPL2018 pic.twitter.com/KWaxSUZYZh
— Jo (@jogtweets) May 20, 2018