ఛత్తీస్గఢ్ : నక్సలిజం ఒక పెద్ద సవాల్ అని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.అయితే ప్రస్తుతం నక్సలిజం తగ్గుతోందని, తన పట్టు కోల్పోతోందని ఆయన చెప్పారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో 261వ బస్తరీయ బెటాలియన్ పాసింగ్ ఔట్ పరేడ్ సభలో ఆయన మాట్లాడారు. నక్సలైట్లతో ఎదురు కాల్పుల్లో మరణిస్తున్న భద్రతా సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు.