హైదరాబాద్: నగరంలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన... పనులు కొనసాగుతున్న తీరు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఆరు వేల కోట్ల వ్యయంతో అబిడ్స్, రాంకోఠి, గన్ఫౌండరీ తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్ఆర్డీసీ రహదారి పనులను ఆకస్మిత తనిఖీలో భాగంగా పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను అభివృద్ధి చేస్తునట్లు మేయర్ తెలిపారు. వర్షాకాలం వస్తే రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో దాదాపు 11 వందల కోట్ల రూపాయల నిధులతో రహదారుల మరమ్మత్తులు చేస్తున్నట్లు వివరించారు