ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 12:00 PM

వేములవాడ: వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశం రుద్రాభిషేకం నిర్వహించారు. హర హర..మహదేవో...శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయం మారు మోగుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో గర్భగుడి దర్శనం నిలిపివేసి లఘు దర్శనం అమలు చేస్తున్నారు. ఆలయంలోని కల్యాణ కట్టలో భక్తులు శ్రీ స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు అచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెలను సమర్పించి కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ర్టంతో పాటు, అంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేసవి కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అవరణలో ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com